top of page
Search

రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారి చేతులమీదుగాహైదరాబాద్ బుక్ ఫెయిర్ పోస్టర్‌ ఆవిష్కరణ


రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు హైదరాబాద్‌లో జరగనున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ - 2025 పోస్టర్‌ను ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం చాలా పెద్ద ఎత్తున, ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పుస్తక మహోత్సవానికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి తన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు యాకూబ్, ప్రధాన కార్యదర్శి ఆర్. వాసు, ఉపాధ్యక్షుడు బాల్ రెడ్డి, కోశాధికారి నారాయణరెడ్డి, మరియు శ్రీనివాస్, దినకర్, తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది బుక్ ఫెయిర్‌ను ఇందిరా పార్క్ వద్ద గల తెలంగాణ భారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతూ, ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈసారి గత సంవత్సరం కంటే స్టాళ్లను అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రచురణకర్తలు పాల్గొంటారని నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. పూర్వకాలపు సాహితీవేత్తలు రచించిన సమాజ హిత పుస్తకాలను సేకరించాలని బుక్ నిర్వాహకులకు మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. వీటిని ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సుమారు కోటి రూపాయలు వెచ్చించి అటువంటి పుస్తకాలను కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఆనాటి మహానుభావులు రచించిన అటువంటి పుస్తకాలను ప్రతి గ్రామంలో గ్రామపంచాయతీలో మహిళా పంచాయతీల్లో గిరిజన ప్రాంతాల్లో ఈ పుస్తకాలను అందుబాటు ఉంచేలా ప్రయత్నం చేయాలన్నారు. ఇటువంటి ముఖ్యమైన పుస్తకాలను సేకరించే పనిలో బుక్ ఫెయిర్ నిర్వాహకులు నిమగ్నమవ్వాలని ఆయన స్పష్టం చేశారు.

 
 
 

Comments


Hyderabad book Fair

contact : 7337411846

Contact

4-4-1, 1st floor, Dishan plaza, sultan bazar, hyderabad 500095

  • Instagram
  • Facebook
  • Youtube

Stay connected!

Follow us on social media for the latest updates and promotions.

Site  Design & Developed by 

bottom of page